Politics

తెరాస “విజయగర్జన” సభ వాయిదా

తెరాస “విజయగర్జన” సభ వాయిదా

వరంగల్‌లో ఈ నెల 15న జరగనున్న తెరాస విజయ గర్జన సభ వాయిదా పడింది. ఈ నెల 29న దీక్షా దివస్‌ రోజున విజయగర్జన సభ నిర్వహించాలని తెరాస నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏళ్ల పండుగ సందర్భంగా వరంగల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ విజయ గర్జన సభ నిర్వహించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గతంలో కరీంనగర్‌లో జరిగిన సింహ గర్జన సభను మించి విజయవంతం చేయాలని తెరాస శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.