Food

సువర్ణ మిఠాయి…కిలో ₹11000

సువర్ణ మిఠాయి…కిలో ₹11000

ధన త్రయోదశి నేపథ్యంలో మహారాష్ట్రలోని అమరావతి నగరంలో ఓ మిఠాయి దుకాణం ‘సువర్ణ కలశ్‌’ పేరుతో మిఠాయిని అందుబాటులోకి తెచ్చింది. పూర్తిగా 24 క్యారెట్ల బంగారు పూతతో దీనిని తయారు చేయడం విశేషం. మొత్తం 12 కేజీల ‘సువర్ణ కలశ్‌’ మిఠాయి తయారు చేసినట్లు రఘువీర్‌ మిఠాయి దుకాణం నిర్వాహకుడు తేజస్‌ పోపత్‌ తెలిపారు. ఇందుకోసం రాజస్థాన్‌ నుంచి నిపుణుల్ని రప్పించినట్లు వివరించారు. సోమవారం నాటికి ఏడు కేజీల వరకు విక్రయాలు పూర్తయ్యాయన్నారు. కొవిడ్‌-19 కారణంగా గతేడాది ఈ ప్రత్యేక మిఠాయిని తయారు చేయలేదని వెల్లడించారు. ఇంతకీ ఇంటిల్లిపాదీ కలిసి ఓ కేజీ ‘సువర్ణ కలశ్‌’తో నోరు తీపి చేసుకోవాలంటే మాత్రం రూ.11,000 వెచ్చించాల్సి ఉంటుంది. బంగారు మిఠాయి కదా.. అందుకే అంత ధర.