సర్దార్ వల్లభ్బాయి పటేల్ జయంతిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సింధు అన్నారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్సీ), ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్టీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత కాన్సులేట్ జనరల్ అసీం మహాజన్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. సుమారు 50 భారతీయ సంఘాల నుంచి 200కు పైగా నాయకులు సమావేశానికి హాజయ్యారు. ఐఏఎన్టీ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర భారత దేశ రాయబారి తరణ్జిత్ సింగ్ సంధును, ఐఏఎన్టీ అధ్యక్షుడు శైలేష్ షా కాన్సులేట్ జనరల్ అసీం మహాజన్ను సమావేశానికి పరిచయం చేశారు.
డల్లాస్లో IAFC-IANT ఆధ్వర్యంలో పటేల్ జయంతి
Related tags :