Devotional

తెరుచుకున్న శబరిమల ఆలయం

తెరుచుకున్న శబరిమల ఆలయం

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం సోమవారం తెరుచుకుంది. సీజనల్​ యాత్ర సందర్భంగా ఆలయ దర్శనం ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి.. మంగళవారం నుంచి భక్తులను అనుమతించనున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. కరోనా కారణంగా గతంలో అనేకసార్లు మూతబడిన దేవాలయం.. దాదాపు రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో తెరుచుకుంది. మంగళవారం నుంచి రోజూ 30 వేల మంది భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు. వర్చువల్ క్యూ బుకింగ్ విధానం ద్వారా భక్తులకు ఎంట్రీ ఉంటుందని దేవస్థానం బోర్డు తెలిపింది. వర్షాలు, వాతావరణ ప్రతికూలతల దృష్ట్యా మొదటి మూడు రోజులపాటు తక్కువమంది భక్తులకే ఆలయ ప్రవేశం ఉంటుందని పేర్కొంది. భక్తుల భద్రత దృష్ట్యా పంపానదిలో స్నానాలను నిషేధించినట్లు వెల్లడించింది.