Politics

బాబును ఓదార్చిన భువనేశ్వరి

బాబును ఓదార్చిన భువనేశ్వరి

అమరావతి, ‘దిగజారిన మనుషులు ఏవో మాట్లాడతారు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు.. వదిలేయండి’ అని టీడీపీ అధి నేత చంద్రబాబును ఆయన సతీ మణి భువనేశ్వరి అనునయించి నట్లు సమాచారం. అసెంబ్లీలో భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన చంద్రబాబు విలపించిన దృశ్యాన్ని టీవీలో చూసిన భువనేశ్వరి.. తాను కూడా విలపించారు. ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారు. ఈ విషయం తెలి సి చంద్రబాబు, లోకేశ్ శుక్రవారం సాయంత్రం హుటా హుటిన హైదరాబాద్లోని ఇంటికి వెళ్లారు. వారిని చూడ గానే ఆమె మరోసారి రోదించారు. కానీ ఆ తర్వాత ఆమె త్వరగానే కోలుకున్నారు. జరిగిన ఘటనలపై బాధపడుతున్న చంద్రబాబును ఆమె అనునయించినట్లు కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘రాజకీయాల్లో ఒక్కోసారి ఇటువంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్నగారు(ఎన్టీ రామా రావు) ఉన్నప్పుడు కూడా కొంతమంది ఆయనను ఉద్దేశించి ఇలాగే నీచంగా మాట్లాడేవారు. మనసుకు బాధ కలిగినా వాటిని వెనక్కి నెట్టి మన పని మనం చేసుకోవాలి. మిమ్మల్ని బాధ పెట్టడానికే ఇలా మాట్లాడుతుంటారు. వారిని పట్టించు కోవద్దు’ అని ఆమె అన్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, అసెంబ్లీలో జరిగిన ఘటనలతో శుక్రవారం బాగా బాధపడిన చంద్రబాబు శనివారం నాటికి కొంత సాధారణ స్థితికి వచ్చారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వరద ప్రాంతాల పరిస్థితిపై చర్చించారు. అక్కడకు పార్టీ బృందా లను పంపాలని నేతలకు సూచించారు. హైదరాబాద్లో అనేక మంది ఆయనను కలిసి మాట్లాడాలని ప్రయత్నించి నా, వారిని కలవడానికి ఆయన ఆసక్తి చూపలేదు. కొద్ది మంది సమీప బంధువులు మాత్రం వచ్చి భువనేశ్వరిని కలిసి మాట్లాడి వెళ్లారు.