NRI-NRT

కాల్గరీ…కెనడాలో కార్తీక దీప వేడుకలు

కాల్గరీ…కెనడాలో కార్తీక దీప వేడుకలు

కాల్గరీ అనఘా దత్త సొసైటీ (కెనడా) సాయి బాబా మందిరంలో కార్తీక దీప వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవమూర్తులకు అభిషేకం, హారతులు, మధ్యాహ్న హారతి, రుద్ర హోమం, కార్తీక పూర్ణిమ సత్యనారాయణ వ్రతం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పండిట్ రాజకుమార్ శర్మ పర్యవేక్షించారు. ఆలయ నిర్వాహుకులు లలిత, శైలేష్ తదితరులు పాల్గొన్నారు.