NRI-NRT

మహిళా సాధికారత పై నాట్స్ వెబినార్

మహిళా సాధికారత పై నాట్స్ వెబినార్

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై ఆన్‌లైన్‌లో సదస్సు ఏర్పాటు చేశారు. మహిళలు ఫేస్ బుక్, జూమ్ యాప్స్ ద్వారా ఈ వెబినార్‌ను వీక్షించి విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు. మహిళ సమస్యల పరిష్కారంపై అవగాహన పెంచుకున్నారు. మహిళల హక్కులు, వారి సమస్యలకు పరిష్కారాలపై పనిచేస్తున్న మానవితో కలిసి నాట్స్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. నాట్స్ వైస్ ఛైర్ పర్సన్ అరుణ గంటి, వ్యాఖ్యత గీతా గొల్లపూడి, లక్ష్మి బొజ్జ, జ్యోతి వనం, పద్మజ నన్నపనేని, ఆశా వైకుంఠం, బిందు యలమంచిలి తదితరులు పాల్గొన్నారు.