NRI-NRT

మలేసియాలో కేసీఆర్ దీక్షా దివస్

మలేసియాలో కేసీఆర్ దీక్షా దివస్

తెలంగాణ రాష్ట్ర సాదనలో ముఖ్య ఘట్టం అయినటువంటి “కేసీఆర్ దీక్షా దివస్” సందర్బంగా తెరాస ఎన్ ఆర్ ఐ కో- ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపుమేరకు మలేషియా ఎన్నారై విభాగం అధ్యక్షుడు శ్రీ చిరుత చిట్టిబాబు గారి సూచనల మేరకు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పామ్కోర్ట్ కండొమినియం లో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమం బేబీ తేజస్విని పాటతో ప్రారంభించి దీక్షాదివస్ యొక్క ప్రాముఖ్యతను వివరించడంతో ముగిసింది.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, రఘునాత్ నాగబండి, రవిందర్ రెడ్డి , హరీష్ గుడిపాటి మరియు ఇతర సభ్యులు ఓంప్రకాష్ బెజ్జంకి, శ్యామ్ పాల్గొనడం జరిగింది.