NRI-NRT

విజయవాడ పేద విద్యార్థినికి చేతన ఫౌండేషన్ ల్యాప్‌టాప్ అందజేత

విజయవాడ పేద విద్యార్థినికి చేతన ఫౌండేషన్ ల్యాప్‌టాప్ అందజేత

విజయవాడ నగరానికి చెందిన పేద ప్రతిభ కలిగిన విద్యార్థినికి చేతన ఫౌండేషన్ లాప్ టాప్ అందజేశారు. కరోనా తీవ్రతతో ప్రతిభావంతులైన విద్యార్థులు తరగతులకు హాజరు అవలేక ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా సిహెచ్ సాయి జాహ్నవి అనే విద్యార్థినికి ల్యాప్‌ టాప్‌ అందజేస్తున్నట్లు చేతన ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవి వెనిగళ్ల, రామ్ చౌదరి ఉప్పుటూరిలు తెలిపారు.