ఇప్పటివరకు పలు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్కు మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. తెలుగు భాష అభివృద్ధితో పాటు పలు సాహిత్య-సాంస్కృతిక కళా రంగాల్లో విశిష్టమైన సేవలు చేస్తున్నందుకు గుర్తింపుగా కేఎల్ యూనివర్సిటీ ఆనంద్కు డాక్టరేట్ను నేడు విజయవాడ సమీపంలోని కేఎల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. ఆనంద్తో పాటు ఇస్రో చైర్మన్ శివన్, volvo మేనేజింగ్ డైరెక్టర్ కమల్ బాలి, ప్రముఖ పండితుడు చాగంటి కోటేశ్వరరావు, సినీనటుడు అలీలకు డాక్టరేట్ ప్రదానం చేశారు. యూనివర్సిటీ ఛాన్సలర్ ఎస్ఎస్ మంత చేతుల మీదుగా ఈ డాక్టరేట్లు ప్రదానం చేశారు. యూనివర్సిటీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ స్వాగతం పలికారు.