Sports

గుంటూరు కుర్రాడు…అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు

గుంటూరు కుర్రాడు…అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు

అంతర్జాతీయ క్రికెట్లో గుంటూరు జిల్లా వాసి చోటు దక్కించుకుని సంచలనం సృష్టించాడు.

వచ్చే నెల నుండి జరిగే అండర్ -19 వరల్డ్ కప్ జట్టులో ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన షేక్ రషీద్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.

రషీద్ ప్రస్తుతం నరసరావుపేటలోని రెడ్డి కళాశాలలో సెకండ్ ఇంటర్ చదువుతున్నాడు.

మంగళగిరిలో ప్రత్యేక కోచ్ ల ద్వారా శిక్షణ పొందుతున్నాడు.

కుర్రాడి ఎంపిక పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు..