Politics

తెలంగాణాలో 30 IPSల బదిలీ. హైదరాబాద్‌కు కొత్త కమీషనర్.

తెలంగాణాలో 30 IPSల బదిలీ. హైదరాబాద్‌కు కొత్త కమీషనర్.

తెలంగాణలో 30 మంది ఐపీఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ను అనిశా డీజీగా నియమించారు. ఆయన స్థానంలో సీవీ ఆనంద్‌ హైదరాబాద్‌ సీపీగా రానున్నారు. అనిశా డైరెక్టర్‌గా షిఖా గోయల్‌, హైదరాబాద్‌ సంయుక్త సీపీగా ఏఆర్‌ శ్రీనివాస్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సంయుక్త సీపీగా ఏవీ రంగనాథ్‌, నల్గొండ ఎస్పీగా రెమా రాజేశ్వరి, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌గా ఎన్‌.శ్వేత, హైదరాబాద్‌ పశ్చిమ మండల డీసీపీగా జోయల్‌ డెవిస్‌, హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌గా కార్తికేయ, మెదక్‌ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని, సైబరాబాద్‌ క్రైం డీసీపీగా కమలేశ్వర్, సైబరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌గా అవినాష్‌ మొహంతి, హైదరాబాద్‌ ఉత్తర మండల డీసీపీగా చందనా దీప్తి, హైదరాబాద్‌ డీసీపీగా గజరావు భూపాల్‌, హైదరాబాద్‌ ఎస్‌బీ జాయింట్‌ కమిషనర్‌గా పి.విశ్వప్రసాద్‌, మహబూబాబాద్‌ ఎస్పీగా శరత్‌ చంద్ర పవార్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా ఎన్‌.ప్రకాశ్‌రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.