Devotional

తమిళనాడులో ₹500కోట్ల పురాతన మరకత శివలింగం

తమిళనాడులో ₹500కోట్ల పురాతన మరకత శివలింగం

భారతదేశం ఆధ్యాత్మికతకే కాదు.. వెలకట్టలేని సిరిసంపదలకు నెలవు. అత్యంత విలువైన, అరుదైన పురాతన మరకత శివలింగం ఒకటి తమిళనాడులోని తంజావూరులో వెలుగు చూసింది. ఈ శివలింగం విలువ 500 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏడీజీపీ కె.జయంత్ మురళి చెన్నైలో వెల్లడించారు.

తంజావూరులోని అరుళనంద నగర్ లో పోలీసులు డిసెంబర్‌ 30న సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎన్ఎస్ అరుణ్ అనే వ్యక్తిని ప్రశ్నించగా తన తండ్రి బ్యాంకు లాకర్ లో శివలింగాన్ని ఉంచినట్టు తెలిపాడు. ఈ సమాచారం ఆధారంగా బ్యాంకు లాకర్ లోని మరకత శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 530 గ్రాముల బరువు, 8 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న దీనిని పురాతనమైనదిగా అరుణ్ పోలీసులకు తెలిపాడు.

జెమాలజిస్టులు దీని విలువ500 కోట్లు ఉంటుందని నిర్ధారించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక ఇది ఏ ఆలయానికి సంబంధించిందో విచారణలో తేలాల్సి ఉందన్నారు. 2016లో నాగపట్టణంలోని తిరుకువలాయ్ శివాలయం నుంచి కనిపించకుండా పోయిన శివలింగం ఇదేనా, కాదా? అని కూడా పోలీసులు విచారణ చేపడతామని తెలిపారు.