Politics

రాజకీయాలు చెడిపోయాయి: జగన్

చెడి పోయిన రాజకీయాల మధ్య పాలన చేస్తున్నామని, రాజకీయ స్వార్థంతో ప్రతి విషయంలో అడ్డుతగులుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ ఏడాదిలోనైనా పేదలకు చేస్తున్న మంచికి అడ్డుతగలవద్దన్న జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మంచి చేయలేని పార్టీలు,నాయకులు విమర్శిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నారన్న సీఎం.. పేదలకు ఆస్తిని పంచి పెడుతుంటే కోర్టులకి వెళ్లి స్టేలు తీసుకొచ్చారన్నారు. అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని అంటే కులాల మధ్య మార్పులు చేర్పులు వస్తాయని కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఓటిఎస్ ను ఇస్తామంటే జీర్ణించుకోలేక పోతున్న ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారన్నారు. అందుబాటు రేటుకు వినోదం అందివ్వాలని నిర్ణయం చేస్తే వ్యతిరేకిస్తున్నారు.