DailyDose

రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ దాడులు

రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ దాడులు

హైదరాబాద్ / అమరావతి :

ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు.

మూడు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలపై దాడులు చేశారు.

తెలుగు రాష్ట్రాలలో 25 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్‌, కర్నూలు, అనంతపురం, నంద్యాల, కడప, తాడిపత్రి, బెంగళూరు, బళ్లారిలో సోదాలు చేపట్టారు.

ఈ సోదాల్లో పెద్దఎత్తున అక్రమాలు బయటపడ్డాయి. 

బుధవారం నుంచి హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నవ్య కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పలు చోట్ల నవ్యసంస్థ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపట్టింది.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్, పటాన్‌చెరులోని సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

మొత్తం మూడు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనికీలు చేపట్టారు.

మరో రెండురోజుల్లో గుంటూరు, కృష్ణా, నెల్లూరు సోదాలు నిర్వహించనున్నట్లు సమాచారం.