‘బాహుబలి’ సిరీస్లో కట్టప్పగా నటించి పాపులర్ అయిన నటుడు సత్యరాజ్కు కరోనా సోకిందని ఇటీవలే నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన పరీక్షల అనంతరం ఆసుపత్రిలో చేరినట్లు తాజా సమాచారం. చెన్నైలోని అమింజిక్కరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సత్యరాజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారట. ఇటీవల సత్యరాజ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చాయి. దాంతో ఆయన సొంతగా ఐసోలేషన్లో ఉన్నారు. గత రాత్రి సత్యరాజ్ పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. సత్యరాజ్ ఆరోగ్యంపై తాజా అప్ డేట్ రావాల్సి ఉంది. కరోనా థర్డ్ మొదలై ఇప్పటికే మహేశ్ బాబు, థమన్, లక్ష్మీ మంచు, మీనా, త్రిష సహా పలువురు సినీ తారలు ఈ వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.