Devotional

శబరిమలలో ‘మకర జ్యోతి’ దర్శనం

శబరిమలలో ‘మకర జ్యోతి’ దర్శనం

‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ అయ్యప్ప నామ స్మరణతో శబరిగిరులు మర్మోగాయి. మకరజ్యోతి దర్శనానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పొన్నాంబలమేడు నుంచి దర్శనమిచ్చిన మకర జ్యోతిని వీక్షించిన అయ్యప్పలు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. కరోనా నేపథ్యంలో ఆలయ కమిటీ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించింది. మకర జ్యోతి దర్శనం అనంతరం ఈనెల 20న ఆలయం మూసివేయనున్నారు.