Fashion

పెంబర్తి దాకా హెచ్ఎండిఏ గ్రీనరీ!

పెంబర్తి దాకా హెచ్ఎండిఏ గ్రీనరీ!

*సీఎం కేసీఆర్ ఆదేశాలతో  పచ్చదనంతో వెల్లివిరుస్తున్న వరంగల్ హైవే 
*ఇప్పటికే రాయగిరి వరకు  సెంట్రల్ మిడెన్ గ్రీనరీ పూర్తి
*అదనంగా 26 కిమీ మల్టీ లేయర్ ప్లాంటేషన్ కు సన్నాహాలు
*గ్రీనరీ  అభివృద్ధిలో  ‘రోల్ మోడల్’ గా నిలుస్తున్న హెచ్ఎండిఏ  
*యాదాద్రి హైవే  గ్రీనరీ తరహాలో నాగ్ పూర్ హైవే 
*మల్టీ లేయర్ ప్లాంటేషన్ పై ఎన్ హెచ్ఏఐ ఆసక్తి 
* యాదాద్రి సెంట్రల్ మిడెన్ ను స్టడీ చేసిన ఎన్ హెచ్ అడ్వయిజర్ 

వరంగల్ నేషనల్ హైవే(163) వెంట ప్రస్తుతం యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్స్  వరకు ఉన్న హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ‘‘మల్టీలేయర్ ప్లాంటేషన్” గ్రీనరీ ని పెంబర్తి వరకు పొడిగించాలని  గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావుగారు పురపాలక శాఖను   ఆదేశించారు.   సీఎం కేసీఆర్ గారి ఆదేశాలను అమలుచేసేందుకు హెచ్ఎండిఏ సన్నాహాలు చేస్తున్నది. రాయగిరి నుంచి పెంబర్తి వరకు 26 కిమీ మేరకు దాదాపు రూ.5కోట్ల వ్యయంతో  మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులు చేపట్టేందుకు హెచ్ఎండిఏ సన్నద్దం అవుతున్నది. 

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి మార్గదర్శకంలో అమలు అవుతున్న ‘‘తెలంగాణకు హరితహారం”కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి శ్రీ కె.టి.రామారావుగారి ఆదేశాల  మేరకు ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్), వరంగల్ నేషనల్ హైవే(163)వెంట హెచ్ఎండిఏ పెంచిన ‘‘మల్టీలేయర్ ప్లాంటేషన్” జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకుంటున్నది. హెచ్ఎండిఏ గ్రీనరీపై  ఇటీవల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్.హెచ్.ఏ.ఐ) అధ్యయనం చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి దేవాలయాన్ని  అభివృద్ధి చేస్తున్న నేపధ్యంలో వరంగల్ నేషనల్ హైవే(163) వెంట గ్రీనరీ పెంపుదలకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సానుకూల స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు వరంగల్ హైవే గ్రీనరీ పెంపుదల బాధ్యతలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి శ్రీ కె.టి.రామారావుకు సూచించారు. వరంగల్ హైవే గ్రీనరీ బ్యూటిఫికేషన్  ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు నేషనల్ హైవే సెంట్రల్ మిడెన్ గ్రీనరీ బ్యూటిఫికేషన్  పనులు రూ.5.5 కోట్ల అంచనాలతో  దాదాపు 30 కిలోమీటర్ల పొడవున మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా ‘‘మల్టీలేయర్ ప్లాంటేషన్” పూర్తి అయ్యి వరంగల్ రహదారి వెంట అకు పచ్చని అందాలు కనువిందు చేస్తున్నాయి.

యాదాద్రి రూట్ లో హెచ్ఎండిఏ పెంచిన మల్టీ లేయర్ ప్లాంటేషన్  ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ కి ఆదర్శంగా(రోల్ మోడల్)గా నిలిచింది.  ఉత్తర్ ప్రదేశ్(ఈస్ట్) వారణాసి నేషనల్ హైవే వెంట హెచ్ఎండిఏ తీర్చిదిద్దిన  ‘‘యాదాద్రి రూట్ మల్టీ లేయర్ ప్లాంటేషన్” మోడల్ ను నేషనల్ హైవే జాయింట్ అడ్వయిజర్(ప్లాంటేషన్) ఎ.కె.మౌర్య గత డిసెంబర్ లో స్టడీ చేసి వెళ్లారు. అంతే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వెంట ఉన్న మోడల్ ప్లాంటేషన్స్, సెంట్రల్ మిడెన్ ప్లాంటేషన్స్, వెహికిల్ అండర్ పాస్(వియూపి)/ ఓవర్ బ్రిడ్జెస్ లతో పాటు ల్యాండ్ పార్సిల్స్ లలో పెంచిన హై డెన్సిటీ ప్లాంటేషన్స్ ను కూడా ఎ.కె.మౌర్య రెండు మూడు రోజుల పాటు స్టడీ చేశారు.