NRI-NRT

పాస్ పోర్ట్ అపాయింట్ మెంట్లు 50%కు తగ్గింపు

పాస్ పోర్ట్ అపాయింట్ మెంట్లు 50%కు తగ్గింపు

ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పాస్పోర్టు దరఖాస్తుదారులకు అపాయింట్ మెంట్లను 50 శాతానికి కుదిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాసోపోర్టు అధికారి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పాస్పోర్టు సేవా కేంద్రాలు, పాస్పోర్టు లఘు కేంద్రాలు, పోస్టాఫీస్ పాలిపో సేవా కేంద్రాలు, ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాల్లో ఈనెల 31 వతేదీ వరకు 50 శాతం అపాయింట్ మెంట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఎవరికైనా మెడికల్ , అత్యవసర ప్రయాణాలు ఉంటే సరైన డాక్యుమెంట్లతో పాస్పోర్టు కార్యాలయంలోని ప్రజా విచారణ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. ఈ కేంద్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తుందని తెలిపారు.