Politics

తెదేపాలో ‘కరోనా’ కలకలం!

తెదేపాలో ‘కరోనా’ కలకలం!

తెలుగుదేశం పార్టీ అగ్రనేతలకు కరోనా సోకడంతో ఆపార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇటీవల కుప్పం, పల్నాడు, తదితర ప్రాంతాల్లో విసృతంగా పర్యటించి అక్కడి ప్రజలతో కలిసిపోయి ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహించారు. ఇటీవల చంద్రబాబు తరచుగా తెదేపా సామాన్య కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. దీంతో చంద్రబాబు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతానికి ఆయన గృహంలో ఐసోలేషన్ లో ఉన్నారు. తనకు కరోనా సోకిందని చంద్రబాబు ట్విట్టర్ లో వెల్లడించారు.

*మరోక పక్క ఆపార్టీ జాతీయ కార్యదర్శి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కు కరోనా సోకింది. తండ్రి కొడుకులు ఇరువురికి ఒకేసారి కరోనా సోకడంతో ఆపార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

*తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ ముగ్గురితో గత వారం రోజుల నుండి సునీతంగా గడిపిన పార్టీ ముఖ్యనేతలు ప్రస్తుతం కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. మరికొందరికి కూడా కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.