Politics

ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడా…: లక్ష్మీపార్వతి

ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడా…: లక్ష్మీపార్వతి

నందమూరి తారకరామారావు చనిపోయినప్పుడు తాను ఆయన ఆత్మతో మాట్లాడానని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి తెలిపారు. మంగళవారం ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నా. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడా. జీవిత రాజశేఖర్‌లు మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారు. ఎన్టీఆర్ ఆత్మ 16 ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి నాతో అనేక విషయాలు పంచుకుంది.’’ అంటూ లక్ష్మీ పార్వతి సంచలన విషయం వెల్లడించారు.ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలపై దాడుల గురించి మాట్లాడుతూ.. ఆ పని ఎవరు చేసినా తప్పేనన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసి సీఎం జగన్ హుందాగా వ్యవహరించారని లక్ష్మీ పార్వతి కితాబిచ్చారు. దుర్గి ఘటనపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నానన్నారు. ప్రతిపక్షాలు కూడా హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఎన్టీఆర్ చల్లని చూపు తెలుగు ప్రజలపై ఉండాలని, ముఖ్యమంత్రుల హృదయాల్లో ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించాలని లక్ష్మీ పార్వతి కోరారు.