లతా మంగేష్కర్కు ఐసీయూలోనే చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి వైద్యుడు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతీత్ సమదాని తెలిపారు. మరోవైపు, లతా మంగేష్కర్ బాగానే ఉన్నారని, తమ కుటుంబ గోప్యతను కాపాడాలంటూ ఆమె మేనకోడలు రచనా షా గురువారం మీడియాకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇండియన్ నైటింగల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 92 ఏళ్ల లతా స్వల్ప కరోనా లక్షణాలతో జనవరి 11న ముబయిలోని బ్రీచ్కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వయసు రిత్యా వైద్యులు ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా ఆమె హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చారు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే. లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన వెల్లడించారు. లతా మంగేష్కర్ ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకుంటున్న అభిమానుల కోసం జల్నాలో విలేకర్లతో సమావేశమై ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు.