Sports

టెన్నిస్ కు గుడ్ బై చెప్పనున్న సానియా

టెన్నిస్ కు గుడ్ బై చెప్పనున్న సానియా

భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఫ్యాన్స్కు షాకిచ్చింది. ఆటకు గుడ్బై తెలపబోతున్నట్లు పేర్కొంది. 2022 సీజన్ తనకు చివరిదని ప్రకటించింది.భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సంచలన నిర్ణయం తీసుకుంది. 2022 సీజన్ తర్వాత ఆటకు వీడ్కోలు పలకబోతున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్లో భాగంగా నేడు జరిగిన మహిళల డబుల్స్ ఈవెంట్ ఓటమి చెందిన అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఈవెంట్లో భారత్కు చెందిన సానియా మీర్జా, ఉక్రెయిన్ ప్లేయర్ నదియా కిచెనోక్ జంట ఓపెనింగ్ రౌండ్లోనే ఓడిపోయింది. స్లొవేనియాకు చెందిన కాజా జువన్, తమర జిడన్సెక్ జంట చేతిలో 6-4, 7-6 తేడాతో ఓటమి చవిచూసింది.”ఇదే నా చివరి సీజన్ అని నేను నిర్ణయించుకున్నాను. ఈ సీజన్ మొత్తం ఆడగలనో లేదో చెప్పలేను కానీ పూర్తిగా ఆడాలనుకుంటున్నాను. ఈ రిటైర్మెంట్కు చాలానే కారణాలు ఉన్నాయి. ఇది అంత ఈజీ కాదని తెలుసు. కానీ తప్పదు. ప్రయాణాలు చేస్తూ నా మూడేళ్ల కొడుకును రిస్క్లో పెట్టలేను. నా శరీరం కూడా సరిగ్గా సహకరించట్లేదు. ఇవాళ నా మోకాలు కూడా బాగా ఇబ్బంది పెడుతోంది. కానీ ఇదే కారణం వల్లే నేను ఓడిపోయానని చెప్పను. కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని అనుకుంటున్నా. నా వయసు కూడా అయిపోతుంది. అయినా ఇప్పటికీ ఆటను ఆస్వాదించేందుకు సిద్ధంగానే ఉన్నా. ఈ సీజన్‌ను విజయవంతంగా ముగించడమే నా ముందున్న లక్ష్యం. కనీసం యూఎస్‌ ఓపెన్‌ (జూన్‌ 16-19) వరకు ఆడేందుకు ప్రయత్నిస్తా. తల్లి అయిన తర్వాత ఫిట్‌నెస్‌ సాధించేందుకు చాలా కష్టపడ్డా. నాకు నేను మోటివేషన్‌ చేసుకునేదాన్ని. అయితే గతంలో ఉన్న ఎనర్జీ లేదనే చెప్పాలి. గాయాల నుంచి కోలుకునేందుకు చాలా రోజుల సమయం పడుతోంది.” అని సానియా పేర్కొంది.సానియా.. తన కెరీర్లో ఆరు గ్రాండ్స్లామ్లు గెలిచింది. వీటిలో మూడు టైటిల్స్ మహిళల డబుల్స్ కాగా.. మరో మూడు మిక్స్డ్ డబుల్స్లో సాధించింది. 2003 నుంచి ఆడుతున్న ఈమె 2013 నుంచి సింగిల్స్ ఆడటం మానేసింది. అప్పటి నుంచి డబుల్స్ మాత్రమే ఆడుతోంది. అంతర్జాతీయంగా ఆమె 68వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. కాగా.. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్లో భాగంగా మిక్స్డ్ డబుల్స్లో అమెరికాకు చెందిన రాజీవ్ రామ్తో కలిసి బరిలో దిగనుంది.