Politics

హైదరాబాద్ భాజపా కార్యాలయానికి భద్రత

హైదరాబాద్ భాజపా కార్యాలయానికి భద్రత

గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్రవాదులు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కార్యాలయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ కార్యాలయాన్ని రక్షణ వలయంలో ఉంచారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో భద్రతను అడిషనల్ డీసీపీ రమణారెడ్డి పర్యవేక్షించారు. భధ్రత లోపాలపై కార్యాలయ సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. కార్యాలయం చుట్టూ ఫెన్సింగ్, అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టాలని ఆయన పోలీస్​సిబ్బందికి సూచించారు.