Devotional

ఫిబ్రవరి 16 నుంచి మేడారం మహాజాతర..

ఫిబ్రవరి 16 నుంచి మేడారం మహాజాతర..

ఫిబ్రవరి 16 నుంచి మేడారం మహాజాతర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాడ్వాయి మండలంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర నిర్వహిస్తారు.మేడారం జాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ జాతర భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఇది విగ్రహాలు లేని జాతర. సమ్మక-సారలమ్మ జాతర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది. కుంభమేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రాష్ట్రం నుంచే కాకుండా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిషా తదితర పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంది. భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ లక్షలాది భక్తులు సమ్మక్క-సారలమ్మ మొక్కులు చెల్లించుకుంటారు.మేడారం మహాజాతరను కరోనా వేరియంట్‌ ఒమైక్రాన్‌ టెన్షన్‌ పెడుతోంది. జాతర 2022 ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరుగనుండడంతో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.75 కోట్లను కేటాయించింది. అయితే ఓ వైపు జాతరలో అభివృద్ధి పనులు కొనసాగుతుండగా.. మరోవైపు అధికారుల్లో ఒమైక్రాన్‌ గుబులు పుట్టిస్తోంది. కోటి మందికిపైగా భక్తులు వచ్చే ఈ జాతరకు వైరస్‌ నియంత్రణ ఎలాఅని వైద్య, ఆరోగ్యశాఖ తర్జనభర్జన పడుతోంది. కాగా, సమ్మక్క-సారలమ్మ వనదేవతల దర్శనానికి రెండోడోస్‌ వ్యాక్సిన్‌ పత్రం లేదా 24 గంటల్లోపు కరోనా నెగెటీవ్‌ రిపోర్టు అయినా చూపిం చేలా అంక్షలు విధించాలనేదానిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మహాజాతర వైద్య, ఆరోగ్య శాఖకు సవాల్‌గా మారటంతో రాష్ట్ర ఉన్నతాధి కారులు స్వయంగా రంగంలోకి దిగారు.