Sports

క్రికెట్‌ అభిమానులుకు గుడ్ న్యూస్‌.. పాకిస్తాన్‌తో భార‌త్ తొలిపోరు

క్రికెట్‌ అభిమానులుకు గుడ్ న్యూస్‌.. పాకిస్తాన్‌తో భార‌త్ తొలిపోరు

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2022 షెడ్యూ ల్‌ను ఐసీసీ శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఈ ఏడాది వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఆస్ట్రేలియా అతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే మ‌రోసారి భార‌త అభిమానులుకు ఐసీసీ గుడ్ న్యూస్ అందించింది. ఈ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కూడా ఒకే గ్రూపులో పాక్‌, భార‌త జ‌ట్లు ఉన్నాయి. దీంతో మ‌రోసారి దాయాదుల పోరుకు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ వేదిక కానుంది. అక్టోబర్ 23న ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్తాన్‌తో త‌మ తొలిపోరులో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. కాగా టీ20 ప్ర‌పంచక‌ప్-2021 లీగ్ ద‌శ‌లో పాక్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2022 అక్టోబర్ 16నుంచి న‌వంబ‌ర్ 13 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. న‌వంబ‌ర్ 9న తొలి సెమీఫైన‌ల్, న‌వంబ‌ర్ 10న రెండో సెమీఫైన‌ల్ జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఫైన‌ల్ మెల్‌బోర్న్ వేదిక‌గా న‌వంబ‌ర్‌ 13న జ‌ర‌గ‌నుంది. మొత్తం 8 జ‌ట్లును రెండు గ్రూపులుగా ఐసీసీ విభిజించింది. గ్రూప్‌-1లో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ జ‌ట్లు ఉండ‌గా, గ్రూప్‌-2లో టీమిండియా,పాకిస్తాన్,ద‌క్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జ‌ట్లు ఉన్నాయి.