Politics

బండి సంజయ్ పై దాడి పోలీసుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

బండి సంజయ్ పై దాడి పోలీసుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పై దాడి ఘటనలో పోలీసులపై బిగిస్తున్న ఉచ్చు…
• బండి సంజయ్ కుమార్ పై పోలీసుల దాడిని తీవ్రంగా పరిగణించిన లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ
• రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గుప్తా, డీజీపి మహేందర్ రెడ్డి, కరీంనగర్ సీపీ సత్యానారాయణ సహా బాధ్యులైన పోలీసు అధికారులకు సమన్లు జారీ 
• ఫిబ్రవరి 3న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సునీల్ కుమార్ ఆదేశాలు 
• పార్లమెంట్ సభ్యుడి కార్యాలయంపైన, ఎంపీపైన దాడి చేసిన తీరుపై బండి సంజయ్ సమర్పించిన ఆధారాలను, వీడియో క్లిప్పింగులను పరిశీలించిన ప్రివిలేజ్ కమిటీ. 
• ఎంపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి గ్యాస్ కట్టర్లతో, ఇనుప రాడ్లతో గేట్లను ధ్వంసం చేసి బండి సంజయ్ ను అరెస్టు చేయడంపట్ల సీరియస్
• బండి సంజయ్ వాదనలు విన్న కొన్ని గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమన్ల జారీ చేసిన లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ
• రాష్ట్ర హైకోర్టు సైతం తనపై దాడి, అరెస్టును తీవ్రంగా తప్పుపట్టిన విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ ద్రుష్టికి తీసుకొచ్చిన బండి సంజయ్
• తనపై రెండోసారి దాడి జరిగిన విషయాన్ని సైతం ప్రివిలేజ్ కమిటీ ద్రుష్టికి తెచ్చిన బండి సంజయ్.
• చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎంపీ వాదన విన్న కొద్ది గంటల్లోనే సమన్లు జారీ చేసిన ప్రివిలేజ్ కమిటీ 
• తన పైన, ఎంపీ ఆఫీస్ పైన దాడి చేసినట్లు గుర్తిస్తూ మరికొందరి పోలీస్ అధికారుల పేర్లను ప్రివిలేజ్ కమిటీకి తెలిపిన బండి సంజయ్
• వారంతా ఫిబ్రవరి 3న ఢిల్లీకి రావాలంటూ సమన్లు జారీ చేసిన ప్రివిలేజ్ కమిటీ
• సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణతోపాటు హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి, జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కొమ్మినేని రాంచందర్‌రావు, హుజూరాబాద్‌   పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వీ.శ్రీనివాస్‌, కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ కె. శ్రీనివాస రావు, కరీంనగర్‌ ఐ-టౌన్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ చలమల్ల నటేష్‌లకు సమన్లు జారీ చేసిన ప్రివిలేజ్ కమిటీ