Devotional

ఆలయ సమీపంలో ఇల్లు నిర్మాణం చేయవచ్చా.. ఆలయ నీడ ఇంటి పై పడితే ఏం జరుగుతుంది? – TNI ఆధ్యాత్మిక వార్తలు

ఆలయ సమీపంలో ఇల్లు నిర్మాణం చేయవచ్చా.. ఆలయ నీడ ఇంటి పై పడితే ఏం జరుగుతుంది? – TNI  ఆధ్యాత్మిక వార్తలు

ఆలయ సమీపంలో ఇల్లు నిర్మాణం చేయవచ్చా.. ఆలయ నీడ ఇంటి పై పడితే ఏం జరుగుతుంది?

సాధారణంగా మనం ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో ఎన్నో వాస్తు నియమాలను పాటిస్తాము. ఇలా వాస్తు నియమాలను అనుసరిస్తూ ఇంటి నిర్మాణం చేపట్టడం వల్ల ఆ ఇంటిలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని భావిస్తారు. ఇకపోతే చాలా మందికి ఇంటి నిర్మాణ విషయంలో ఒక సందేహం ఉంటుంది. ఆలయానికి సమీపంలో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చా ఒకవేళ ఆలయం నీడ ఇంటి పై పడితే ఏం జరుగుతుంది అనే సందేహాలు కలుగుతుంటాయి. అయితే ఆలయ సమీపంలో ఇంటిని నిర్మించటం వల్ల ఏం జరుగుతుంది? ఏ ఆలయం సమీపంలో ఇంటి నిర్మాణం ఎంత దూరంలో నిర్మించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

**వాస్తు శాస్త్రం ప్రకారం ఆలయం నీడ ఇంటిపై పడకూడదు అని చెపుతారు అందుకే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆలయానికి సమీపంలో మన ఇంటిని నిర్మించుకోకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.ఇలా ఆలయం నీడ మన ఇంటి పై పడితే మన ఇంట్లో ఉన్న ఐశ్వర్యం తగ్గిపోతుందని ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. సాధారణంగా మూడు రకాల ఆలయాలు ఉన్నాయి ఒకటి శివాలయం, రెండు వైష్ణవాలయం, 3 శక్తి స్వరూప ఆలయాలు.

**శివాలయం విషయానికి వస్తే ఆలయం ఉన్న అన్ని దిక్కుల 100 బారాల లోపు ఇల్లు నిర్మించకూడదు. ఇలా అన్నివైపుల 100 బారల స్థలం విడిచిపెట్టాలి. పరమేశ్వరుడికి మూడు కళ్ళు ఉంటాయి కనుక ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు తన మూడో కంటిని తెరిచిన సమయంలో అతని ఆగ్రహానికి గురికావలసి వస్తుంది కనుక శివాలయానికి సమీపంలో ఇంటి నిర్మాణం చేపట్టకూడదని చెబుతారు. విష్ణు ఆలయానికి వెనుక భాగంలో ఇంటి నిర్మాణం చేపట్టకూడదు. విష్ణువు అలంకార ప్రియుడు, ఈయన సూర్యనారాయణ అవతారంలో ఉన్నప్పటికీ సూర్యుడి వృత్తాకార కిరణాలు సౌమ్య రూపంలో విష్ణుమూర్తి వెనుక భాగాన చక్రంలో తిరుగుతూ ఉంటాయి.అదే చక్రం రాక్షసులతో కూడా పోరాడుతుంది కనుక విష్ణుదేవుడి ఆలయం వెనుక భాగంలో ఇంటి నిర్మాణం చేపట్టకూడదు.

**ఇక శక్తి స్వరూపిణి ఆలయాలు అయినా అమ్మవారు ఎంతో ఆగ్రహంతో ఉంటారు అలాగే వారి రెండు చేతులలో మారణాయుధాలు ఉంటాయి కనుక అమ్మవారి ఆలయం కుడివైపు ఎడమవైపు 120 బారల స్థలం వదిలి ఇంటి నిర్మాణం చేపట్టాలి. అందుకే శక్తి స్వరూపిణి ఆలయాలకు ఇల్లు దగ్గరగా ఉండకూడదు. ఇకపోతే ప్రతి ఆలయం ముందు ధ్వజస్తంభం ఉండటం మనం చూస్తుంటాము. ఈ ధ్వజస్తంభం దీపపు స్థంభం అని కూడా అంటారు. ధ్వజస్తంభంపై దీపం వెలిగించడం వల్ల ఆకాశంలో విహరించే దేవతలకు దారి చూపుతుంది ఆ సమయంలో దేవుడు దేవేరులతో కలిసి విహరిస్తూ ఉంటాడు కనుక ఆ దీపపు వెలుగును మనం చూడకూడదు. అందుకే ధ్వజస్తంభం సమీపంలో కూడా ఆలయ నిర్మాణం చేపట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1.నెగటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమలకు అనుమతి
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, లేదా దర్శనానికి 48 గంటల లోపు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది. గతంలోనే టీటీడీ ఈ నిబంధనల గురించి ప్రకటనలు చేసినప్పటికీ కొంత మంది భక్తులు ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండా అలిపిరి చెక్పాయింట్కు వస్తున్నారు. దీంతో సిబ్బంది అలాంటి వారిని వెనక్కి పంపుతున్నారు. ఒవైుక్రాన్ అతివేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్,లేదా ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

2.ములుగు జిల్లా మేడారం జాతర సమీపిస్తున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దాదాపు 50 వేలకు పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు తరలివచ్చి.. జంపన్నవాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఉదయం 11 గంటల వరకే గద్దెలపైకి భక్తులను అనుమతించిన పోలీసులు ఆ తర్వాత గ్రిల్స్కు తాళాలు వేశారు. అనంతరం భక్తులు బయటి నుంచే అమ్మవార్లకు మొక్కుకున్నారు. ప్రైవేటు వాహనాల్లో భక్తులు తరలి రావడంతో అక్కడ క్కడ ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కా గా.. మేడారం వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి జంపన్న వాగు వద్ద ఫిట్స్తో మృతి చెందాడు.