NRI-NRT

భాజపాలో చేరిన ప్రవాస భారతీయురాలు

భాజపాలో చేరిన ప్రవాస భారతీయురాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో ఎన్ఆర్ఐ బాలా త్రిపురసుందరి భాజపాలో చేరారు. ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కు చెందిన బాల త్రిపుర సుందరి లండన్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో పలు హోదాల్లో విధులు నిర్వర్తించిన ఆమె గత కొన్ని సంవత్సరాల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. పలు సామాజిక, సేవా కార్యక్రమాలు బాలత్రిపురసుందరి నిర్వహిస్తున్నారు. బీజేపీ సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ఆమె చెప్పారు. జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన కోడుగల్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయురాలు శ్రీమతి రెడ్డి రెడ్డి బాల త్రిపుర సుందరి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొల్లి మాధవి, బిజెపి రాష్ట్ర కోశాధికారి శ్రీ భండారి శాంతి కుమార్, బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అఫ్సర్ పాషా, బిజెపి సీనియర్ నాయకులు శ్రీ నాగూరావు నామాజీ, శ్రీ మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.