Devotional

టీటీడీ ముఖ్య ప్రకటన TNI – ఆధ్యాత్మికం – 27/01/2022

టీటీడీ ముఖ్య ప్రకటన  TNI – ఆధ్యాత్మికం  – 27/01/2022

1.ఆ వెబ్‌సైట్‌లలో మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలి.
శ్రీవారి ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లను ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ ఈనెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలకు స్లాటర్‌ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పీఆర్‌వో విభాగం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులంతా విడుదల చేసే సమయంలో టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

2.తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 27,446 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 13,403 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

3.మల్లన్న జాతరలో కిక్కిరిసిన భక్తులు
ఓదెల మండల కేంద్రంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం బుధవారం భక్తులతో కిక్కిరిసింది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి సాగే వనదేవతల జాతర సందర్భంగా భక్తులు ముందుగా మల్లన్న ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా వివిధ జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో భక్తులు పట్నాలు, బోనాలు, కోడె మొక్కులను సమర్పించారు.