Politics

మాజీ సీఎం మనుమరాలు ఆత్మహత్య

మాజీ సీఎం మనుమరాలు ఆత్మహత్య

కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మనుమరాలు అనుమానాస్పద రీతిలో మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మనుమరాలు సౌందర్య(30) అనుమానాస్పద స్థితిలో వసంత నగరలోని తన ఇంట్లో మృతదేహమై కనిపించింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబంతో సౌందర్యయడియూరప్ప కుమార్తె అయిన పద్మావతి కూతురు సౌందర్య. ఆమె కుటుంబ కలహాలతో కొద్దిరోజులుగా డిప్రెషన్లో ఉన్నట్లు సమాచారం. డాక్టర్ అయిన సౌందర్య 2018లో డా. నీరజ్ను వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప. బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో సౌందర్య ఉరి వేసుకున్నట్లు తెలిసింది. పోస్ట్మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు.