DailyDose

TNI నేర వార్తలు 28/1/2022

TNI నేర వార్తలు 28/1/2022

*కడలూరు సమీపంలో శిధిలావస్థకు చేరిన ఇళ్లు కూలిన ఘటనలో ఇద్దరు ప్లస్ టూ విద్యార్థులు మృతిచెందిన ఘటన విషా దానికి దారితీసింది.

*తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ యువకుడిపై దాడిచేసిన నిందితుడి అతడి కంటిలో ఐసు ముక్కతో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. దేశరాజధాని ఢిల్లీలోని టాగోర్ గార్డెన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుల్లో ముగ్గురు స్థానికులకు చిక్కగా వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

*సూర్యాపేటలో నకిలీ యూరియా కలకలం రేపింది. పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్లోని ఓ దుకాణంలో యూరియా బస్తాలో ఇసుక వచ్చిందని షాప్ ఎదుట రైతులు ధర్నా చేశారు. రైతుల ఫిర్యాదుతో నర్మద యూరియాను వ్యవసాయశాఖ అధికారులు ల్యాబ్కు పంపారు.

*తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన భార్య.. భర్తను అతికిరాతంగా హత్య చేసింది.

*కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ డిపోలో బస్ డ్రైవర్గా పనిచేస్తున్న రాజయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స కోసం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల క్రితం రాజయ్య యాక్సిడెంట్ చేశాడు. దీనికి బాధ్యత వహిస్తూ తనను సస్పెండ్ చేస్తారేమోనని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశాడని అధికారులు పేర్కొంటున్నారు. అయితే రాజయ్య ఆత్మహత్యాయత్నానికి అధికారుల వేధింపులే కారణమని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

*ఆమెకు 20 ఏళ్లు! పెళ్లయింది. అత్తగారింట్లో ఉన్న ఆమెను కొందరు అపహరించి.. సామూహిక అత్యాచారం చేశారు. ఆపై శిరోముండనం చేసి, మెడలో చెప్పులదండ వేసి వీధుల్లో తిప్పారు. ఈ ఘటన ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. దేశరాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగింది. బాధితురాలి పట్ల కక్ష పెట్టుకొని ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన యువతి, ఓ బాలుడు స్నేహితులు. గత ఏడాది నవంబరులో ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి చావుకు యువతే కారణమని అతడి కుటుంబసభ్యులు కక్ష పెంచుకున్నారు. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనే నిర్ణయానికొచ్చి ఇంతటి ఘోరానికి ఒడిట్టారు. బాధితురాలికి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అత్యంత అవమానకర రీతిలో ఆమెను వీధుల్లో ఊరేగించిన తాలూకు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

*కెనాడాలో విషాదం చోటు చేసుకుంది. తమ కలలను పండించుకునేందుకు విదేశీ బాట పట్టిన ఓ భారతీయ కుటుంబం దారి మధ్యలోనే తనువు చాలించింది. విషాద ఘటన కెనడా – అమెరికా సరిహద్దులో జనవరి 19న చోటు చేసుకుంది.

*టేకులపల్లి పరిధి డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రాంగణం సమీపంలో ఓ వృద్ధుడు ఐదో తరగతి చదువుతున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు దేహశుద్ధి చేశారు. బాధిత బాలిక తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. పదేళ్ల బాలిక తన తమ్ముడితో కలిసి గురువారం ఇళ్ల సమీపంలో రేగిపండ్ల కోసం వెళ్లగా అరటిపండ్లు విక్రయించే 53ఏళ్ల వీరమల్ల వెంకన్న ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.కౌగిలించుకుని అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో చిన్నారి గట్టిగా కేకలు వేయగా వదిలేయడంతో పరుగున ఇంటికి చేరుకుని విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. కోపోద్రిక్తుడైన తండ్రి స్థానికులతో కలిసి డబుల్ బెడ్రూం బ్లాక్లో ఉన్న అతడి ఇంటికి వెళ్లి కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఖానాపురం హవేలీ ఠాణా సీఐ జే.రామకృష్ణ తెలిపారు.