Health

దేశంలో తగ్గుతున్న కరోనా ..పెరుగుతున్న మరణాలు

దేశంలో తగ్గుతున్న కరోనా ..పెరుగుతున్న మరణాలు

దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరణాలు మాత్రం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గత 24గంటల్లో 2,09,918 కొత్త కేసులు బయటపడగా.. 959 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 4,13,02,440కి, మరణాలు 4,95,050కి పెరిగాయి. ప్రస్తుతం 18,31,268 మంది ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. తాజాగా మరో 2.62లక్షల మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు 166.03కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేశారు.