Devotional

మేడారం ఆదాయం రూ.1,34,60,000

మేడారం ఆదాయం రూ.1,34,60,000

జాతర నేపథ్యంలో ఇసుక వేసిన రాలనంత మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఇక తండోపతండాలుగా మేడారం చేరుకుని ఇక సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఇకపోతే ఇటీవలే హుండీ లెక్కింపు ప్రారంభించారు. బుధవారం ఈ హుండీ లెక్కింపు ప్రారంభం కాగా ఇటీవలే ముగిసినట్లు తెలుస్తోంది.
హనుమకొండలోని కళ్యాణమండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి లెక్కించారు అధికారులు. అయితే తెలంగాణాకే తలమానికమైన మేడారం సమ్మక్క-సార్క జాతర ఈ ఏడాది వైభవోపేతంగా జరిగింది. సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ నెల 16 నుంచి 19 వరకు మేడారం జాతర కన్నుల పండువగా సాగింది. అయితే మేడారం జాతర హుండీల లెక్కింపును బుధవారం ప్రారంభించారు.హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 497 హుండీల్లో ఇప్పటివరకు 65 హుండీలను తెరిచారు. ఇప్పటివరకు రూ.1,34,60,000 ఆదాయం రాగా.. అధికారులు బ్యాంకులో జమ చేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరకు కోటి మందికిపైగా తరలించారు.