NRI-NRT

మార్చి 1న రామినేని పురస్కారాల మహోత్సవం

మార్చి 1న రామినేని పురస్కారాల మహోత్సవం

అమెరికాకు చెందిన డా.రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో 22వ పురస్కారాల మహోత్సవాన్ని మార్చి 1వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ డా.రామినేని ధర్మ ప్రచారక్, కన్వినర్ పాతూరి నాగభూషణం తెలిపారు. గుంటూరు జిల్లాలో ఉన్న మండల విద్యాశాఖ అధికారులకు పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్ధులకు పురస్కారాలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిధిగా విచ్చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మంగళగిరి సమీపంలో ఉన్న CKకన్వెన్షన్ హాల్ నందు ఈ ఉత్సవాన్ని మధ్యాహ్నం 11 గంటల నుండి నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ క్రింది ఆహ్వాన పత్రికను పరిశీలించండి.

1st-March-11am-Dr-Ramineni