NRI-NRT

యూరప్ లోని 40 సిటీల్లో తెదేపా 40వ వార్షికోత్సవ వేడుకలు

యూరప్ లోని  40 సిటీల్లో తెదేపా 40వ వార్షికోత్సవ వేడుకలు

మార్చి 29కి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి 40 ఏళ్లు పూర్తికానుంది . ఈ నేపథ్యంలో తెదేపా ఆధ్వర్యంలో 40 వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఆ పార్టీ ఎన్నారై నేతలు సన్నాహాలు చేస్తున్నారు . యూరప్ లోని 40కి పైగా నగరాల్లో ప్రవాసాంధ్రులు పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు . తెదేపాకు చెందిన ఎన్నారై విభాగం సీనియర్ నేత జయకుమార్ గుంటుపల్లి ఆధ్వర్యంలో వేణు పోపూరి , ప్రసన్న నాదెండ్ల , ఎ.భాస్కర్ , అనిల్ , టిట్టు , శివ ( జర్మనీ ) , మురళి రాపర్ల ( ఐర్లాండ్ ) తదితర ప్రముఖుల సహకారంతో ఈ వేడుకలు జరపనున్నారు. ఎంతోకాలంగా తెదేపా యూరప్ విభాగానికి సేవలందిస్తున్న సీనియర్ నేతలను సన్మానించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెదేపా 40 వ వార్షికోత్సవ వేడుకల కోసం nritdpeurope.com వెబ్సైట్ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు జయకుమార్ తెలిపారు . యూరప్ లోని ఎన్నారైలకు ఓ జ్ఞాపకంలా నిలిచిపోయేలా ఈ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని .. దీనిలో తెదేపా . నందమూరి కుటుంబ అభిమానులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు .