పద్మశ్రీ పురస్కారం అందుకున్న యోగా గురువు స్వామి శివానంద వయసు 125 ఏళ్లు అని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. 1896 ఆగస్టు 8న సిలైత్ (ప్రస్తుతం బంగ్లాదేశ్ ఉంది)లో జన్మించారు. ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులు చనిపోగా, ఆశ్రమంలో పెరిగారు. గత 50 ఏళ్లుగా ఒడిశాలోని పూరీలో కుష్ఠు రోగులకు సేవ చేస్తున్నారు. నిత్యం యోగా చేస్తూ నూనె, మసాలాలు లేని ఆహారం తీసుకుంటారు. అందుకే 125 ఏళ్ల వయసులోనూ చలాకీగా ఉన్నారు.