NRI-NRT

ఈ నాణెం ఖరీదు రూ.144 కోట్లు

ఈ నాణెం ఖరీదు రూ.144 కోట్లు

చాలామందికి అరుదైన నాణేలు సేకరించే అలవాటు ఉంటుంది. అందుకోసం ఎంత డబ్బైనా వెచ్చిస్తారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలోని సోత్‌బీలో జరిగిన వేలంలో ఈ బంగారు నాణెం ఏకంగా రూ.144 కోట్లకు అమ్ముడుపోయింది. 1933లో ముద్రితమైన ఈ నాణేన్ని ‘డబుల్‌ ఈగల్‌ గోల్డ్‌ కాయిన్‌’గా పిలుస్తారు. దీని ముఖ విలువ 20 డాలర్లు మాత్రమే.