NRI-NRT

బోస్టన్‌లో ఘనంగా తెదేపా 40వసంతాల వేడుక

బోస్టన్‌లో ఘనంగా తెదేపా 40వసంతాల వేడుక

బోస్టన్ ఎన్నారై టీడీపీ కార్యకర్తలు సమావేశమై తెలుగుదేశం పార్టీ 40 వసంతాల వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్ర్మాంలో పాల్గొన్న కార్యకర్తలు మాట్లాడుతూ…

* ప్రతి గ్రామ కూడలిలో ఒక బ్యానర్ రూపంలో తెలుగుదేశం చేసిన సంస్కరణలు, నిత్యావసర వస్తువులు రేట్లను గత ప్రభుత్వ హయాముకి ఇప్పటికి వ్యత్యాసాలను ప్రదర్శించాలని కోరారు.

* ఒక తెలుగు సోదరుడు తాను ఈరోజు ఉన్నత స్థానం లో ఉండటానికి కారణం వారి తల్లితండ్రులతో పాటు, తెలుగుదేశం చేసినటువంటి రైతులకి పంట రుణాలు, సబ్సిడీ విద్యుత్తు, ఈట్ రెవల్యూషన్, సరైన సమయములో ఇంజనీరింగ్ కాలేజీల ఆవశ్యకతను గుర్తించి వాటిని పెంచేవిదంగా కృషి చేయటం వంటి సంస్కరణలు కారణమని, పార్టీ ఈరోజు రెండు తరాల నుండి చదువుకున్న యువత విదేశాలలో స్థిరపడటం వలన కోల్పోయింది. కాబట్టి కొంత పార్టీ కోసం తిరిగి ఇవ్వవలసిన సమయం ఆసన్నమైందని గుర్తుచేశారు.

* ప్రతి ఎన్నారై, రోజుకి ఒక నిమిషము సమయము వెచ్చించి సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారాలను ఎండగట్టి వాస్తవాలను ప్రజానీకాన్ని చేరవేయాలని సూచించారు.

* పేదరికం వలన కనీస అవసరాలు అయినటువంటి కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం ఇలాంటివి అందక ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి కనీసం రెండు కుటుంబాలని, ప్రతి ఎన్నారై దత్తత తీసుకోవాలని ఆకాంక్షించారు. తద్వారా వారిలో తెలుగుదేశం యుక్క సిద్ధాంతాన్ని, లక్ష్యాలను ఆలోచింప చేయగలరని చెప్పారు.

* ఒక ఎన్నారై ఆవేదన చెందుతూ, గుడివాడలో తనకున్న షాపింగ్ కాంప్లెక్స్ ని ప్రస్తుతం వున్న మాఫియా గవర్నమెంట్ నాయకులు ఖబ్జా చేసి దోచుకోవడానికి ప్రయత్నించారని, ఇలానే వదిలేస్తే రేపు అందరి ఎన్నారైల ఆస్తులని గుర్తించి లాగేసుకుంటారని, ఇలాంటి అక్రమార్కులకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ని గుర్తుచేసుకుంటూ, పార్టీ స్థాపించనప్పటినుండి ఇప్పటివరకు, 40 వసంతాల కాలంలో తెలుగు దేశం చేసిన సంస్కరణలను ప్రదర్శించారు. చంద్రబాబు సందేశాన్ని జూంలో ప్రదర్శించారు. అధికార ప్రతినిధి పట్టాభి జూం ద్వారా పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్ నినాదాలతో సభ ముగించారు.

Boston NRI TDP Celebrates TDP 40th Anniversary
Boston NRI TDP Celebrates TDP 40th Anniversary