తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను డాలస్ నగరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మైత్రి రెస్టారెంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడు ముళ్లపూడి బాపిరాజు అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు గాంధీ పార్క్ నుండి కార్ల ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రవాస తెలుగుదేశం నేతలు చింతమనేని సుధీర్, కె.సి.చేకూరి, పోలవరపు శ్రీకాంత్, లోకేష్ నాయుడు, సుగన్ చాగర్లమూడి, వెన్నం మురళీ తదితరుల నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన చిత్రాలు ఇవి….
డల్లాస్లో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Related tags :