Business

ఆ రెండూ విలీనం.. మల్టీప్లెక్స్​ వ్యాపారంలో ఇక వాటిదే హవా

ఆ రెండూ విలీనం.. మల్టీప్లెక్స్​ వ్యాపారంలో ఇక వాటిదే హవా - PVR Cinepolis India Merger

మల్టీప్లెక్స్‌ వ్యాపార సంస్థలు పీవీఆర్‌, సినీపొలిస్‌ ఇండియాలు విలీనం కానున్నాయి. ఇక నుంచి మల్టీప్లెక్స్‌ వ్యాపారంలో రెండు సంస్థల హవా కొనసాగుతుందని సినీరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మల్టీప్లెక్స్‌ వ్యాపార సంస్థలు పీవీఆర్‌, సినీపొలిస్‌ ఇండియాలు విలీనం కానున్నాయి. విలీన ఒప్పందానికి ఇరు సంస్థల బోర్డులు ఆదివారం ఆమోదం తెలిపాయి. విలీనానంతర సంస్థకు పీవీఆర్‌ సీఎండీ అజయ్‌ బిజ్లీ ఎండీగా కొనసాగనున్నారు. ఇదే సంస్థకు చెందిన సంజీవ్‌ కుమార్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఐనాక్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ పవన్‌ కుమార్‌ జైన్ బోర్డు నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా, సిద్ధార్థ్‌ జైన్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ నాన్‌-ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఉండనున్నారు. ఆదివారం ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఇరు సంస్థలు ఈ వివరాలను వెల్లడించాయి. ఈ సంస్థల కలయిక వల్ల భారత మల్టీప్లెక్స్‌ రంగంలో ఈ రెండు కంపెనీలే రాజ్యమేలే పరిస్థితి వస్తుందని, ఈ రంగంలో మార్పులకు దారితీస్తుందని భావిస్తున్నారు.

పీవీఆర్​ ఐనాక్స్​ లిమిటెడ్​గా:
షేర్ల రూపంలో జరిగిన ఈ ఒప్పందానికి ఇంకా పీవీఆర్‌, ఐనాక్స్‌ షేర్‌హోల్డర్ల ఆమోదం లభించాల్సి ఉంది. స్టాక్ ఎక్స్ఛేంజీలు, సెబీ, సీసీఐ నుంచి కూడా అనుమతి అందాల్సి ఉంటుంది. అనుమతులన్నీ లభించి ఒప్పందం అమలైతే.. పీవీఆర్‌లో ఐనాక్స్‌ విలీనం అవుతుంది. ఐనాక్స్‌ షేర్‌హోల్డర్లందరికీ పీవీఆర్‌ షేర్లు లభించనున్నాయి. విలీనానంతర సంస్థను పీవీఆర్‌ ఐనాక్స్ లిమిటెడ్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. మల్టీప్లెక్స్‌ వరకు చూస్తే పీవీఆర్‌+ఐనాక్స్‌, సినీ పొలిస్‌లు కలిసి బాక్సాఫీసు ఆదాయంలో 50 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నాయి. అంటే భారత మల్టీప్లెక్స్‌ వ్యవస్థలో వీటిదే ఆధిపత్యం కానుందన్నమాట!దేశీయంగా పీవీఆర్‌కు 846 తెరలు ఉండగా.. సినీపొలిస్‌కు 417 తెరలున్నాయి. ఈ రెండూ కలవడం వల్ల విలీన సంస్థ 1263 తెరలతో దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్‌ సంస్థగా మారింది. విలీన కంపెనీలో సినీపొలిస్‌కు 20శాతం వాటా.. పీవీఆర్‌ ప్రమోటర్లకు 10-14 శాతం వాటా ఉంటుందని కొన్ని మీడియా వర్గాల కథనాల ప్రకారం తెలుస్తోంది. విలీన సంస్థపై తొలి మూడేళ్ల పాటు ప్రస్తుత పీవీఆర్‌ సీఎండీ అజయ్‌ బిజ్లీకి యాజమాన్య నియంత్రణ ఉంటుందని సమాచారం.

35-37 శాతానికి మార్కెట్‌ వాటా:
దేశంలోనే మూడో అతిపెద్ద మల్టీప్లెక్స్‌ కంపెనీ, మెక్సికన్‌ థియేటర్‌ చైన్‌ అనుబంధ సంస్థ అయిన సినీపొలిస్‌ ఇండియాతో పీవీఆర్‌ విలీనమైంది. అయితే.. విలీన సంస్థకు సినిమా వ్యాపారంలో 35-37 శాతం వాటా దక్కుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్కో తెరకు రూ.9 కోట్ల చొప్పున సినీపొలిస్‌ను లెక్కగట్టే అవకాశం ఉందని.. పీవీఆర్‌తో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ అని వారు అంటున్నారు.బాక్సాఫీసు బద్దలే.. : విలీన కంపెనీకి మల్టీప్లెక్స్‌ విభాగంలో 42శాతం వాటా.. మొత్తం భారత సినిమా తెరల్లో 15% వాటా దక్కనుంది. అయితే మల్టీప్లెక్స్‌ వరకు చూస్తే పీవీఆర్‌+సినీపొలిస్‌, ఐనాక్స్‌ లీజర్‌లు కలిసి బాక్సాఫీసు ఆదాయంలో 50 శాతం వాటా కలిగి ఉన్నాయి. అంటే భారత మల్టీప్లెక్స్‌ వ్యవస్థలో ద్వంద్వ ఛత్రాధిపత్యానికి తెరలేస్తుందన్నమాట. 2018లో ఐనాక్స్‌, సినీపొలిస్‌ మధ్య విలీన చర్చలు జరిగాయి. అయితే అవి సాఫల్యం కాలేదు. అదే ఏడాదిలో సినీపొలిస్‌ 500 తెరలను జత చేయడం కోసం రూ.1500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. 2022 కల్లా భారత్‌లో తెరల సంఖ్యను 600కు చేరుస్తామని 2019లో తెలిపింది.

తెలుగు సినిమా స్టార్లూ కారణమే:
దక్షిణాదిన.. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో నలుగురయిదుగురు సూపర్‌స్టార్లు ఉన్నారు. వీరు పాన్‌ ఇండియా స్టార్లుగా మారుతున్నారు. కాబట్టి నిర్మాతలు ఎక్కువ తెరలపై తమ సినిమాను విడుదల చేయడానికి పూనుకుంటారు. అది తెరల సంఖ్య మరింత పెరగడానికి కారణంగా మారుతుందని ఓ విశ్లేషకుడు అంటున్నారు. మల్టీప్లెక్స్‌ సంస్థల పోటీ తగ్గడం వల్ల తెరలపై పెట్టుబడులకు అవకాశం పెరుగుతుందనీ పేర్కొన్నారు. పీవీఆర్‌కు ఉత్తర భారత్‌లో భారీ వాటా ఉందని.. మరో వైపు సినీపొలిస్‌కు మెట్రోయేతర నగరాల్లో అధిక తెరలున్నాయి. ఈ రెండింటి కలయిక వల్ల దేశవ్యాప్తంగా ఒకే సంస్థకు తెరలు ఉన్నట్లు అవుతుంది. అయితే ఈ విలీనం వల్ల పోటీ తగ్గి, తెరల సంఖ్య పెరగడంపై ప్రభావం పడుతుందని అంటున్న వారూ లేకపోలేదు. సినీపొలిస్‌ చేతికి నియంత్రణ వెళితే పీవీఆర్‌తో సంబంధాలు బాగున్న మాల్‌ డెవలపర్లపై ప్రతికూల ప్రభావం పడొచ్చన్న వాదనా ఉంది.