DailyDose

ఏప్రిల్ 11న మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ ?

ఏప్రిల్ 11న మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ ?

రాష్ట్ర మంత్రిమండలి ఏప్రిల్ 7న సమావేశం కానుంది. ఆ సమావేశంలో మంత్రిమండలిలో కొనసాగే వారెవరు? వైదొలగనున్నది ఎవరెవరనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

రాష్ట్ర మంత్రిమండలి ఏప్రిల్ 7న సమావేశం కానుంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇదే ప్రస్తుత మంత్రిమండలి చివరి బేటీ కానుంది. ఆ సమావేశంలో మంత్రిమండలిలో కొనసాగే వారెవరు? వైదొలగనున్నది ఎవరెవరనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి 7న జరిగే సమావేశానికి ఎజెండా కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ప్రభుత్వశాఖల అదిపతులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. దీనిపై నేడో రేపో అధికారిక వర్తమానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపే అవకాశముంది.ప్రస్తుత మంత్రిమండలిలోని మంత్రుల్లో తొలగించే వారితో వ్యక్తిగతంగా రాజీనామా చేయించి వాటన్నింటినీ కలిపి గవర్నర్​కు పంపడం లేదా కేబినెట్ హెడ్ తన మంత్రివర్గంలోని కొందరు మంత్రులను మార్చుకుంటున్నానని వివరిస్తూ, వారి పేర్లతో కూడిన లేఖను గవర్నర్​కు ముఖ్యమంత్రే అందించవచ్చు. వాటిని ఆమోదిస్తూ ఆయా ఖాళీలను గవర్నర్ నోటిపై చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆయా ఖాళీల్లో కొత్తగా నియమించుకోనున్న వారి పేర్ల జాబితాను ముఖ్యమంత్రి గవర్నర్​కు సమర్పిస్తారు. దాన్ని ఆమోదించి, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి సమయాన్నివ్వాలని గవర్నర్​ను కోరతారు.7న మంత్రిమండలి భేటీ జరగనుండగా… మరుసటి రోజు 8న ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను కలవనున్నట్లు సీఎంవో సమాచారం. దీన్నిబట్టి 8న గవర్నర్​ను కలిసినప్పుడు రాజీనామా చేస్తున్న మంత్రుల జాబితాను… అలాగే కొత్తగా కేబినెట్​లోకి తీసుకోనున్న వారి జాబితాను గవర్నర్​కు ముఖ్యమంత్రి సమర్పించే అవకాశమున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏప్రిల్ 11న మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ జరగవచ్చనే వాదనకు ఈ పరిణామాలు బలాన్ని చేకూరుస్తున్నాయి.