NRI-NRT

యూరోప్ ఎన్నారై టీడీపీ వింగ్ ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకలు!

యూరోప్ ఎన్నారై టీడీపీ వింగ్ ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకలు!

నాటి పాలకులు ఢిల్లీ నడి వీధుల్లో తెలుగోడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుంటే..ఇది తెలుగు వాడి సత్తా అని చెప్పి, పేదోడికి కూడు, గూడు, గుడ్డ అందించటమే లక్ష్యంగా అన్న NTR పార్టీ పెట్టి, 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ పుట్టి 40 వసంతాలు నిండిన సందర్భంగా NRI యూరోప్ టీం Dr. శ్రీ కిషోర్ బాబు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు నవీన్ సామ్రాట్ జలగడుగు , గోగినేని శ్రీనివాస్ , శ్యామ్ సుందర్ రావు ఊట్ల గార్ల సమక్షంలో ఈస్ట్ లండన్ ( ILFORD, BARKING, EASTHAM ) లో తెలుగుదేశం పార్టీ అభిమానులు అంతా ఒక్కొక్కరుగా వచ్చి ఒక సమూహంలా అయ్యి 40 సంవత్సరాల ఉత్సవాలను పండుగను తలపించేలా చేశారు.
1c
వేదిక మొత్తం పసుపు మయం చేసి తెలుగుదేశం పాటలు, స్లోగన్స్ మధ్య వేదిక దద్దరిల్లేలా ఆనందోత్సాహాలతో కేరింతలు పెట్టి, కులమతాలు వేరైనా తామంతా తెలుగుదేశం పార్టీ కుటుంభ సభ్యులమని ప్రపంచానికి చాటి చెప్పారు. ‘అధికారంలో వున్నా లేకున్నా నేను తెలుగుదేశం, నాది తెలుగుదేశం, మాది తెలుగుదేశం’ అని ప్రతీ ఒక్కరూ తమ అభిమానాన్ని చూపారు. ఈ కార్యక్రమానికి తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యి TDP NRI యూరోప్ TEAM సేవలను కొనియాడారు. పరాయి దేశంలో వున్నా తెలుగుదేశం పార్టీ మీద NRI TDP యూరోప్ TEAM సభ్యులు చూపిస్తున్న అభిమానానికి ముగ్ధులయ్యారు. అలాగే యూత్‌ని ఆకట్టుకునేలా ప్రసంగించారు.రాబోయే రోజుల్లో NRI TDP యూరోప్ టీం సభ్యుల సేవలను పార్టీ కోసం మాతృ భూమిలో 2024లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే కార్యక్రమంలో నిమగ్నం కావాలని, వారి కోసం తెలుగు యువత తరుపున ఎలాంటి సహాయ సహకారాలయినా అందిస్తానని చెప్పారు. చివరిగా అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహించిన NRI TDP యూరోప్ కిషోర్ టీంకు, వేడుకలకు హాజరయినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబసబ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, సురేంద్ర రెడ్డి, నాగార్జున, రాజీవ్ రెడ్డి, సుధీర్ కొత్తపల్లి, సాయి రెడ్డి, ఆదిత్య, తదితర NRI TDP యూరోప్ టీం వారు పాల్గొన్నారు.
1d