NRI-NRT

40 దేశాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

40 దేశాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను 40 దేశాల్లో ఎన్ఆర్ఐలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయా దేశాల్లో స్థిరపడిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో టీడీపీ పుట్టిందన్నారు. సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్ అని, తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందేనన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు వంటి సంస్కరణలు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని కొనియాడారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఫుడ్ సెక్యూరిటీ విధానాన్ని రూ. 2కే కిలో బియ్యం పథకంతో ఎన్టీఆర్ ఎప్పుడో అమల్లో పెట్టారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పార్టీ బలోపేతం కానుందని, పార్టీ స్థాపించిన మూహుర్త బలం గొప్పదని అన్నారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకుని నిలబడుతుందన్నారు. ఎంత మంది పార్టీని ఇబ్బందుల్లో పెట్టాలని ప్రయత్నించినా రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తుందన్నారు. ఎవరు ఏ దేశంలో ఉన్నా.. రాష్ట్ర భవిష్యత్తుకు ఎన్ఆర్ఐలు సహకరించాలని చంద్రబాబు కోరారు.