Food

ఆరోగ్యాన్ని పెంచే పనస…

ఆరోగ్యాన్ని పెంచే పనస…

తీయగా, ఎక్కువ పీచుతో ఉండే పనస పండును ఇష్టంగా తింటాం. క్యాలరీలతో నిండిన ఈ పం డులో కొలెస్ట్రాల్ అస్సలుండదు. ఆరోగ్యానికి, అందానికి మేలు చేసే గుణాలు పనసలో ఎక్కువ. ఈ పం డుతో కలిగే ఇతర ప్రయోజనాలేమంటే..
పనస పండులో ఎ, సి, ఈ, కె, బి6, నియాసిన్ విటమిన్లతో పాటు రక్తం తయారీకి అవసరమైన కాపర్, మాంగనీస్, మె గ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవి రక్తహీన త ముప్పును అడ్డుకుంటాయి.పనస గింజల్లో ప్రొటీన్లు మెండు. అందుకే వీటిని పలురకాల వంటకాల్లో రుచికోసం వాడతారు. పప్పు ధాన్యాలలో లభిం చే పోషకాల్లో దాదాపు ఈ గింజల్లో లభిస్తాయి.తల భాగంలో రక్తప్రసరణ సవ్యంగా జరిగేందుకు పనస పం డు తోడ్పడుతుంది. శిరోజాలు ఏపుగా పెరుగుతాయి.వీటి గింజల్లోని విటమిన్ ఎ కంటిని ఆరోగ్యంగా ఉంచుతుం ది. పొడిజుట్టు, వెంట్రుకలు కొస భాగంలో చిట్లిపోవడం వం టి సమస్యలను నివారించి, శిరోజాలను సంరక్షిస్తుంది.పనస పండులోని సి విటమిన్ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూను అడ్డుకుంటుంది..తక్కువ క్యాలరీలు ఉన్నప్పటికీ, ఫ్రక్టోజ్, సుక్రోజ్ చక్కెరలు శరీరానికి వెంటనే శక్తినందిస్తాయి. ఈ పండులో కొలెస్ట్రాల్ ఉండదు. అందుకే దీన్ని ‘హెల్తీఫుడ్’గా తీసుకోవచ్చు.పనస గింజల్ని నిమిషం పాటు పాలలో నానబెట్టి వీటిని పొడి చేసుకొని చర్మ ముడతల మీద రాసుకోవాలి. ఇలా 6 వారాలు అప్లై చేస్తే ముడతలు తగ్గి, అందంగా కనిపిస్తారు.ఎండిన పనస గింజల్ని పాలు, తేనెలో నానబెట్టి, మెత్తని పే స్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖం తా జాదనంతో వెలిగిపోతుంది.
వీటి గింజల్ని నేరుగా తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య తగ్గిపోతుంది.ఈ గింజల్లోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీటి గింజల్లోని పొటాషియం, రక్తంలోని సోడియం నిల్వల్ని నియంత్రిస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరుకు అవసరమైన కాపర్ పనసలో లభిస్తుంది. అధిక, అల్ప రక్తపీడ నం, గుండెపోటు వచ్చే ముప్పును నివారిస్తుంది.