Movies

ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక పురస్కారం

Auto Draft

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. సెలబ్రిటీ హోదాను సామాజిక సేవకు ఉపయోగించాలని ప్రయత్నించేవారిలో ఉపాసన ముందు వరుసలో ఉంటారు. అందుకోసం ఆమె నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. మన సొసైటీకే కాదు పర్యావరణ హితమైన కార్యక్రమాల్లోనూ ఆమె చురుకుగా పాల్గొంటూ ఉంటారు. హ్యూమన్ లైఫ్‌తో పాటు వైల్డ్ లైఫ్‌ను కాపాడాలనేది ఉపాసన ఆలోచన. ఈ దిశగా తన సేవలను అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ ఛైర్ పర్సన్‌గా కొనసాగిస్తున్న ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డ్ దక్కింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా 2022 ఏడాదికి గాను ఆమె ఈ పురస్కారాన్నిఅందుకోనున్నారు.ఈ సందర్భంగా ఉపాసన కొణిదెల మాట్లాడుతూ.. ‘‘ఓ గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని భాగం చేసిన తాతయ్య, అపోలో ఆస్పత్రుల ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డిగారికే ఈ అవార్డ్ ఘనత దక్కుతుంది. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వైద్య సేవలను మెరుగుపర్చాలనే ఆయన లక్ష్యమే నాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చింది..’’ అని తెలిపారు.