Movies

ఆ జానర్‌లో చేయాలనుంది

ఆ జానర్‌లో చేయాలనుంది

తనదైన గ్లామర్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్‌ బ్యూటీ కృతిసనన్‌ తాజాగా ‘బచ్చన్‌పాండే’ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నారు. అయితే ఎక్కువగా హీరో ప్రాధాన్య చిత్రాలు చేయడం వల్ల చాలా బోర్‌కొడుతోందని అంటోంది ఈ భామ. హీరోకి జోడీగా తప్ప కథలో అంతగా ప్రాధాన్యంలేని పాత్రల వల్ల ఒక్కోసారి విసుగొస్తోందంటున్నారు కృతి.రెగ్యులర్‌ చిత్రాలకు భిన్నంగా అవకాశం దొరికితే దేశభక్తి నేపథ్యంలో ఓ చిత్రం చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. అయితే ఆ దిశగా ఇప్పటికే ముందడుగు పడిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రావడం ఖాయమని కృతి మీడియాకి హింట్‌ ఇచ్చారు. ‘దేశభక్తి చిత్రాలను చూడడం నాకు ఇష్టం. ఇప్పటికే ఓ కథ విన్నాను. నాకు నచ్చింది. మిగిలిన విషయాలు త్వరలోనే వెల్లడిస్తాను’ అని చెప్పారు.