Movies

రెండేళ్ల విరామం తర్వాత..

రెండేళ్ల విరామం తర్వాత..

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సీనియర్‌ కథానాయిక అనుష్క సెట్స్‌మీద అడుగుపెట్టబోతున్నారు. అనుష్క, నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో యువీ క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. పి. మహేష్‌బాబు దర్శకుడు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 4 నుంచి మొదలుకానుంది. ‘యూవీ క్రియేషన్స్‌లో అనుష్క నటిస్తున్న మూడో చిత్రమిది. ఈ సినిమాలో ఆమె సరికొత్త లుక్‌లో కనిపిస్తారు. టైటిల్‌ను త్వరలో ప్రకటిస్తాం. వినూత్న కథాంశంతో రూపొందించబోతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అని చిత్రబృందం తెలిపింది.