సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకులుగా పరిచయమవుతున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 12న విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలుంటాయి. లక్ష్యసాధనలో యశోదకు ఎదురైన పరిస్థితులు, వాటిని అధిగమించి గమ్యాన్ని చేరుకున్న వైనం ఆసక్తిని రేకెత్తిస్తుంది. సమంత పాత్ర భిన్న పార్శాలతో సాగుతుంది. హైదరాబాద్లో వేసిన భారీ సెట్స్లో కీలక ఘట్టాల్ని తెరకెక్కించాం. మంగళవారం కొడైకెనాల్లో తాజా షెడ్యూల్ ప్రారంభించాం’ అని చెప్పారు.