ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థి అమెరికాలో గుండెపోటుతో మృతి చెందాడు. ఒంగోలు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన కార్తీక్ అనే విద్యార్థి ఇటీవల ఎంఎస్ చదువుకోసం షికాగో వెళ్లాడు. నిన్న ఆకస్మాత్తుగా గుండెలో నొప్పిరావడంతో ఉన్న స్థానంలో కుప్పకూలి మరణించాడు.కుమారుడి మరణం వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతదేహాన్ని తరలించేందుకు అమెరికాలోని తానా సభ్యులు కృషి చేస్తున్నారు.